దిశ కమిషన్ విచారణకు హాజరైన సజ్జనార్
- దిశ ఎన్ కౌంటర్ కేసులో విచారణకు హాజరు
- ఆయనతో పాటు క్లూస్ టీమ్ వెంకన్న కూడా హాజరు
- 7వ తేదీన మరోసారి విచారణకు రావాలని సజ్జనార్ కు ఆదేశం
విచారణ సందర్భంగా... ఎన్ కౌంటర్ సమయంలో నిందితుల చేతిలో ఆయుధాలు ఉన్నాయా? ఉంటే వాటిపై వేలి ముద్రలను సేకరించారా? తదితర ప్రశ్నలను వెంకన్నకు కమిషన్ సంధించింది. ఘటనా స్థలి వద్ద పంచనామా చేసిన రెవెన్యూ అధికారిని కూడా ప్రశ్నించింది. మరోవైపు 7వ తేదీన మరోసారి విచారణకు రావాలని సజ్జనార్ ను ఆదేశించింది.