'గులాబ్' తుపాను మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం విషయమై జగన్ కీలక ఆదేశాలు

CM Jagan orders to give immediate financial aid for those dead due to cyclone
షార్ట్స్‌లో చూడండి
గులాబ్  తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తుపానుపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా హాజరయ్యారు. సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే... విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని జగన్ చెప్పారు. తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల సాయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు.
Go Back to Shorts
Gulaba Cyclone
Andhra Pradesh
Jagan
Review Meeting

More Telugu News