నారా లోకేశ్ ను ఉండవల్లిలోని నివాసానికి తరలించిన పోలీసులు
- ఇటీవల హత్యకు గురైన అనూష
- నరసరావుపేట వచ్చేందుకు ప్రయత్నించిన లోకేశ్
- గన్నవరంలో అడ్డుకున్న పోలీసులు
- లోకేశ్ కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు
ఈ క్రమంలో నారా లోకేశ్ ను ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. అంతకుముందు లోకేశ్ కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అటు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్ తో సమావేశమయ్యారు. లోకేశ్ పర్యటనను అడ్డుకోవడం, ఇతర పరిణామాలపై ఆమె సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. మహిళల భద్రత, అత్యాచార ఘటనల్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్టు సమాచారం.