టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు డ్రగ్స్ వాడుతున్నారు: బండి సంజయ్
- గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారు
- బీజేపీ అధికారంలోకి రాగానే రక్త పరీక్షలను నిర్వహిస్తాం
- భాష విషయంలో కేసీఆరే నా గురువు
కేసీఆర్ కెప్టెన్ అయితే, ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ కు వచ్చిందని... అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.