టెస్టు ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి పడిపోయిన కోహ్లీ
- టెస్టు ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
- నెంబర్ వన్ స్థానంలో జో రూట్
- వరుసగా సెంచరీలు బాదిన రూట్
- ఐదో ర్యాంకుకు చేరుకున్న రోహిత్
బౌలింగ్ ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ జాబితాలో ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఎలాంటి మార్పులేదు. టీమిండియాతో టెస్టు సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 'ఆరు' నుంచి ఐదోస్థానానికి చేరుకున్నాడు.
