Team India: హెడింగ్లే టెస్టులో ఓటమి అంచున భారత్

Team India lost quick wickets in Headingley
  • 215/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్
  • వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన వైనం
  • 42 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్
  • రాబిన్సన్ కు 5 వికెట్లు
హెడింగ్లేలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ ఓటమికి చేరువలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 215-2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్ నాటకీయంగా వికెట్లు కోల్పోయింది. 42 పరుగుల తేడాతో 6 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 97 ఓవర్లలో 8 వికెట్లకు 257 పరుగులు. రవీంద్ర జడేజా, బుమ్రా క్రీజులో ఉన్నారు.

అంతకుముందు, పుజారాను అవుట్ చేయడం ద్వారా భారత్ పతనానికి ఓల్లీ రాబిన్సన్ శ్రీకారం చుట్టాడు. సెంచరీకి 9 పరుగుల దూరంలో పుజారా అవుట్ కాగా, ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ (55), రహానే (10) కూడా వెనుదిరిగారు. పంత్ కేవలం 1 పరుగు చేసి నిరాశపరిచాడు. రాబిన్సన్ కు 5 వికెట్లు లభించాయి.

భారత్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. పరిస్థితి చూస్తే ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ కు దిగాల్సిన అవసరం రాకపోవచ్చు.
Team India
Headingley
England
Third Test

More Telugu News