Andhra Pradesh: ఏపీలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

AP registers 1002 new Corona Cases
  • రాష్ట్ర వ్యాప్తంగా 1,002 కేసులు నమోదు
  • తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 265 కేసులు
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 14,159
ఏపీలో కరోనా కేసులు మరింత తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 265 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,508 మంది కరోనా నుంచి కోలుకోగా... 12 మంది మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20,03,342 కేసులు నమోదు కాగా... 19,75,448 మంది కోలుకున్నారు. మొత్తం 13,735 మంది మృతి చెందారు. నేటి వరకు రాష్ట్రంలో 2,61,39,934 శాంపిల్స్ ను పరీక్షించారు.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News