దళితబంధు ఎఫెక్ట్.. రెండు రోజుల పాటు విశ్వబ్రాహ్మణుల రిలే నిరాహారదీక్షలు
- తమకు కూడా విశ్వకర్మబంధు ప్రకటించాలి
- ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- కేసీఆర్ గతంలో ప్రకటించిన రూ. 250 కోట్లను మంజూరు చేయాలి
విశ్వకర్మీయులకు విశ్వకర్మబంధు ప్రకటించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వకర్మ సామాజికవర్గ సంక్షేమానికి రూ. 250 కోట్లు మంజూరు చేస్తానని 2016లో నిర్వహించిన వరంగల్ సభలో కేసీఆర్ ప్రకటించారని... ఇంతవరకు ఆ నిధులను విడుదల చేయలేదని విమర్శించారు. సీఎం ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.