గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనపై సీపీ అంజనీకుమార్ వివరణ
- గాంధీ ఆసుపత్రిలో రేప్ కలకలం
- ఓ మహిళ ఫిర్యాదు
- తీవ్రస్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
- రేప్ ఓ కట్టుకథ అని తేల్చిన వైనం
ఈ కేసులో ఎలాంటి మిస్టరీ లేదని, మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఆమె స్వయంగా వెళ్లిపోయిందని, ఫిర్యాదు చేసిన ఆమె సోదరి పోలీసులను తప్పుదోవ పట్టించిందని సీపీ అంజనీకుమార్ వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో లభ్యమైన ఆధారాల సాయంతో ఈ కేసును ఛేదించామని తెలిపారు. ఈ కేసులో టెక్నీషియన్ ఉమామహేశ్వర్ ప్రమేయం లేదని వెల్లడించారు.