పోలీస్ స్టేషన్ లో భోజనం కూడా ముట్టని నారా లోకేశ్
- రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్
- అరెస్ట్ చేసి, ప్రత్తిపాడు పీఎస్ కు తరలించిన పోలీసులు
- పోలీస్ స్టేషన్ లో ఆందోళనకు దిగిన లోకేశ్
మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లోనే నారా లోకేశ్ ఆందోళనకు దిగారు. పరామర్శించడానికి వెళ్లినవారిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. అరెస్ట్ కు నిరసనగా మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఆయన ముట్టలేదు. ఇంకోవైపు ప్రత్తిపాడు పీఎస్ ఎదుట పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గుమికూడారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.