కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటో... వివరణ ఇచ్చిన కేంద్రం
- రాజ్యసభలో ప్రశ్నించిన కుమార్ ఖేట్కర్
- కాంగ్రెస్ సభ్యుడికి సమాధానమిచ్చిన మంత్రి
- కరోనాపై మోదీ సందేశమిచ్చారని వెల్లడి
- ఫొటోతో పాటు సందేశం ముద్రించామని వివరణ
తొలుత కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రీతిని వివరించారు. ఆపై, కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన తీరును ప్రస్తావించారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ బొమ్మను, ఆయన ఇచ్చిన సందేశాన్ని ముద్రిస్తున్నామని వివరణ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మోదీ వివరంగా చెప్పారని, ఆయన సందేశం ప్రజల్లో తప్పకుండా అవగాహన కలిగిస్తుందని ఆమె తెలిపారు.
ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇది నైతిక బాధ్యతగా భావిస్తున్నామని, వ్యాక్సిన్ తో సరిపెట్టకుండా మరింత చైతన్యం కలిగించేలా సందేశం ఇవ్వడం ప్రభుత్వ ధర్మం అని వివరించారు.