పూర్తిస్థాయి సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
- కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్
- నిన్ననే సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన బోర్డులు
- హాజరు కాని తెలంగాణ ప్రభుత్వం
కాగా, సమన్వయ కమిటీ సమావేశానికి ముందు పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇది వరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఇప్పుడు ఇదే విషయమై కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. అయితే, ఈ రెండు బోర్డులు నిన్ననే సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. హైదరాబాద్లో నిన్న జరిగిన ఈ సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరు కాలేదు.