తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భార్యాభర్తలు
- మామిడికుదురు మండలంలో ఘటన
- బ్రిడ్జిపై నుంచి వశిష్ఠ నదిలోకి దూకిన కుటుంబం
- మోసం, వేధింపులు భరించలేకేనంటూ లేఖ, ఆడియో
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రిడ్జిపై ఉన్న బైక్, చిన్నారుల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, కొందరు వ్యక్తులు తమను దారుణంగా మోసం చేశారని, వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్య పేరుతో ఉన్న లేఖ, ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.