థర్డ్ వేవ్ భయాలు... అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
- మళ్లీ క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- కొన్ని దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని వార్తలు
- ఆగస్ట్ 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన ప్రభుత్వం
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం 2021 ఆగస్ట్ 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో డీజీసీఏ పేర్కొంది. ఈ నిషేధం కార్గో (రవాణా) విమానాలకు వర్తించదని తెలిపింది. అయితే కొన్ని సెలెక్ట్ చేసిన రూట్లలో అవసరాలను బట్టి కేస్ టు కేస్ బేసిస్ కింద అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలను అనుమతిస్తామని వెల్లడించింది.