Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,540 కరోనా పాజిటివ్ కేసులు.. పూర్తి వివరాలు ఇవిగో!

AP registers 1540 new Corona cases in 24 hours
  • తూర్పు గోదావరి జిల్లాలో కేవలం మూడు కేసుల నమోదు
  • 24 గంటల్లో 19 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,965
ఏపీలో గత 24 గంటల్లో 1,540 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,304 మంది కరోనా నుంచి కోలుకోగా... 19 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం మూడు కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 280 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,57,932 కేసులు నమోదు కాగా... 19,23,675 మంది కోలుకున్నారు. మొత్తం 13,292 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News