ఢిల్లీలో మమత బిజీబిజీ.. నేడు మోదీతో భేటీ
- సాయంత్రం నాలుగు గంటలకు భేటీ
- కాంగ్రెస్ సీనియర్ నేతలతోనూ సమావేశం
- రేపు రాష్ట్రపతి, సోనియాతో భేటీ
రేపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీలను కలుస్తారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలని మమత భావిస్తున్నారు. ఇందులో భాగమే ఈ పర్యటన అని చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో విపక్ష నేతలందరూ ఢిల్లీలో ఉన్నారు. దీంతో అందరినీ ఒకేసారి కలుసుకునే వీలుంటుందనే మమత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు, రేపు ఆమె బిజీబిజీగా గడపనున్నారు.