ఓవైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుండగా హనుమాన్ చాలీసా చదివిన మహిళ
- ఓ యువతికి మెదడులో కణితి
- నిన్న శస్త్రచికిత్స నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు
- 3 గంటల పాటు ఆపరేషన్
- 40 శ్లోకాలు చదివిన యువతి
దీనిపై ఎయిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ దీపక్ గుప్తా వివరాలు తెలిపారు. ఆమెకు లోకల్ అనెస్థీషియా (స్థానికంగా మత్తు) ఇవ్వడంతో పాటు నొప్పి నివారణ ఔషధాలు కూడా వాడామని వెల్లడించారు. ఇక, మెదడు ఆపరేషన్ల సందర్భంగా రోగులు మెలకువతో ఉండాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. రోగులు మెలకువతో ఉండడం వల్ల వారి మెదడులోని ఏ కీలక భాగం కూడా శస్త్రచికిత్స వల్ల నష్టపోయే ప్రమాదం ఉండదని వెల్లడించారు.