చరిత్రలో ఒకేసారి 1.30 లక్షల మందికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం ఒక్కటే: సజ్జల
- ఏపీఎన్జీవో మాజీ చీఫ్ చంద్రశేఖర్ రెడ్డికి సన్మానం
- ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలా ఆయనని నియమిస్తామన్న సజ్జల
- వైఎస్సార్ లో ఉన్న విజన్ జగన్ లోనూ ఉందని కితాబు
ఇక, సజ్జల ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఒకేసారి 1.30 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించింది జగన్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ కు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. సీపీఎస్ అమలు అంశం కాస్త జటిలమైనది కావడంతో ఆలస్యమైందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కసరత్తులు చేస్తున్నారని సజ్జల వెల్లడించారు. ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన అంశాలు, ఆర్థికపరమైన విషయాలన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
గతంలో ఉద్యోగుల అంశంలో వైఎస్సార్ ఎలాంటి దార్శనికత కలిగి ఉన్నారో, ఇప్పుడు సీఎం జగన్ లోనూ అదే దార్శనికత ఉందని సజ్జల కొనియాడారు.