క్రికెట్ అభిమానులకు నిరాశ... శ్రీలంక, టీమిండియా క్రికెట్ సిరీస్ వాయిదా
- లంక, భారత్ సిరీస్ పై కరోనా ప్రభావం
- ఇటీవల ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన లంక జట్టు
- లంక జట్టులో ఇద్దరికి కరోనా
- జట్టు మొత్తాన్ని క్వారంటైన్ కు తరలించిన అధికారులు
దాంతో, నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన సిరీస్ కాస్తా, మరో 4 రోజులు వాయిదా పడింది. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ ను రీషెడ్యూల్ చేసినట్టు తెలిపాయి. లంకతో సిరీస్ ఈ నెల 17న ప్రారంభం అవుతుందని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం లంక క్రికెటర్లు ఓ హోటల్లో క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.