Andhra Pradesh: ఏపీలో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు!

AP registers 3166 new Corona cases
  • గత 24 గంటల్లో 21 మంది మృతి
  • తూర్పుగోదావరి జిల్లాలో 664 కేసుల నమోదు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,356
ఏపీలో కరోనా కేసులు స్థిరంగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 664 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 45 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 21 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నలుగురు వంతున చనిపోయారు. ఇదే సమయంలో 4,019 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,11,231కి చేరగా... 18,65,956 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,919 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.26 కోట్లకు పైగా శాంపిల్స్ ని పరీక్షించారు.

Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News