మా పొలంలోని బావి మాయమైంది.. కాస్త వెతికిపెట్టరూ!: పోలీసులకు రైతు ఫిర్యాదు
- కర్ణాటకలోని బెళగావి జిల్లా మావినహొండలో ఘటన
- పోలీసులకు ఫిర్యాదుతో అధికారుల బాగోతం వెలుగులోకి
- రైతు పొలంలో బావిని తవ్వినట్టు అక్రమ రికార్డులు
మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించి, ప్రభుత్వ నిధులు కాజేశారు. అంతేకాక, బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీంతో విస్తుపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.