నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు!: సోనూసూద్
- ఇప్పటికే నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్
- హారతులు ఇస్తూ, బాణసంచా కాల్చుతూ సంబరాలు
- మరో వీడియోను పోస్ట్ చేసిన సోనూసూద్
ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ట్రక్ కు ఉన్న సోనూసూద్ ఫ్లెక్సీకి మహిళలు బొట్లు పెట్టారు. 'థ్యాంక్యూ సోనూసూద్' అంటూ ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు వైద్యులు, నర్సులు కూడా పాల్గొన్నారు. కాగా, కరోనా రెండో దశ విజృంభణలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో చలించిపోయిన సోనూసూద్ ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి, ఆ మాటను నిలబెట్టుకున్నారు.