ప్రారంభానికి సిద్ధమైన బాలానగర్ ఫ్లైఓవర్.. తీరనున్న వాహనదారుల కష్టాలు
- రూ. 385 కోట్ల వ్యయంతో నిర్మాణం
- 2017లో శంకుస్థాపన చేసిన కేటీఆర్
- రేపు ప్రారంభించనున్న కేటీఆర్
1.13 కి.మీ పొడవున్న ఈ ఫ్లై ఓవర్ ను 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో నిర్మించారు. ఆరు లేన్లతో నగరంలో నిర్మించిన తొలి ఫ్లై ఓవర్ ఇదే కావడం గమనార్హం. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించారు. ఈ ఫ్లై ఓబర్ ను రేపు కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ గా నామకరణం చేయనున్నారు.