Andhra Pradesh: ఏపీలో కొత్తగా 3,175 కరోనా కేసులు

AP Covid cases and deaths bulletin
  • గత 24 గంటల్లో 94,595 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 662 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు
  • రాష్ట్రంలో 29 మంది మృతి
  • ఇంకా 35,325 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 94,595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,175 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 662 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,692 మంది కరోనా నుంచి కోలుకోగా, 29 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,54,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,325 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 12,844కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
COVID19
New Cases
Deaths

More Telugu News