మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రభుత్వం
- హైకోర్టు స్టేతో నిలిచిన సిట్ విచారణ
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన సర్కారు
- విచారణ 3 వారాలకు వాయిదా
అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే టీడీపీ నేతలు, దమ్మాలపాటి శ్రీనివాస్ అక్రమంగా భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో సిట్ విచారణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.