లాక్డౌన్ కారణంగా రద్దు చేసిన పది రైళ్లు మళ్లీ పట్టాలపైకి
- సికింద్రాబాద్, కాజీపేట, ఆదిలాబాద్, ముంబై నుంచి ప్రారంభం కానున్న రైళ్లు
- మరో 8 రైళ్ల గడువు పొడిగింపు
- రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు కిషన్రెడ్డి కృతజ్ఞతలు
సికింద్రాబాద్-రక్సౌల్ (07026), రక్సౌల్-సికింద్రాబాద్ (07025), హైదరాబాద్-గోరఖ్పూర్ (02575), గోరఖ్పూర్-హైదరాబాద్ (02576), షాలిమార్-సికింద్రాబాద్ (02449), సికింద్రాబాద్-షాలిమార్ (02450) రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. కాగా, హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను 12 నుంచి 57కు పెంచినందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.