తెలంగాణ సీఎం కేసీఆర్పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి విమర్శలు
- చివరకు తమ చితి తామే పేర్చుకుంటున్నారు
- ఆపై దానిపై కాల్చుకునే స్థితికి రైతులు చేరుకున్నారు
- మీరు చెప్పే బంగారు తెలంగాణలో మీ పాలనలో రైతుల దీనస్థితి ఇది
'అయ్యా కేసీఆర్ గారు… చివరకు తన చితి తాను పేర్చుకుని, కాల్చుకునే స్థితికి రైతులు చేరుకున్నారు.. మీరు చెప్పే బంగారు తెలంగాణలో మీ పాలనలో నేడు రైతుల దీనస్థితి ఇది' అంటూ విష్ణువర్ధన్రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలను ఆయన ట్యాగ్ చేశారు.