జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్
- మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని ఆదేశం
- మీడియాతో మాట్లాడకూడదని షరతు
- విచారణకు సహకరించాలని ఆదేశాలు
దీంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై కొంతకాలంగా విచారణ చేస్తున్న హైకోర్టు.. తాజాగా బెయిల్ ఇచ్చింది. అయితే, పలు షరతులను విధించింది. రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని, కేసుకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడకూడదని, విచారణాధికారులకు ఎప్పటికప్పుడు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పీలేరు సబ్ జైలులో ఉన్నారు.