ఇసుక రీచ్ ల మోసాలు... చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఇసుక రీచ్ ల పేరిట ఘరానా మోసం
- ఏకంగా సీఎం జగన్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వైనం
- నిందితుడిది విశాఖ అని గుర్తించిన పోలీసులు
- ఓ వ్యక్తి నుంచి రూ.2 కోట్లు వసూలు
కర్రి సురేంద్రనాథ్ అనే వ్యక్తి నుంచి ఇసుక రీచ్ ల పేరిట రూ.2 కోట్లు వసూలు చేసినట్టు డీసీపీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. నిందితుడు చంద్రశేఖర్ పై గతంలో హైదరాబాదులోని సైఫాబాదులోనూ ఓ కేసు నమోదైనట్టు తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. మరికొంతమందిని కూడా ఇసుకరీచ్ ల పేరిట మోసగించినట్టు తెలిసిందని, దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించామని తెలిపారు.