Chiranjeevi: 'పుష్ప' సాంగులో మెగాస్టార్ మెరుస్తారంటూ రూమర్!

Chiranjeevi in Pushpa special song
  • సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ క్రేజీ కాంబినేషన్
  • స్పెషల్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్
  • 'పుష్ప' కోసం మాస్ మసాలా సాంగ్
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
ఇప్పుడు టాలీవుడ్లో ఒక రూమర్ గుప్పుమంటోంది. 'పుష్ప'లోని ఒక పాటలో చిరంజీవి కనిపించనున్నారనేదే ఆ రూమర్. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా అలరించనుండగా, ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఓ నెలరోజుల పాటు షూటింగు చేస్తే, ఫస్టు పార్టుకు సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. దేవిశ్రీ - సుకుమార్ కాంబినేషన్లో ఇంతవరకూ వచ్చిన స్పెషల్ సాంగ్స్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి. అలాగే ఈ సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఈ సాంగులో ఒక చోట చిరంజీవి ఇలా మెరిసి అలా మాయమవుతారట. ఆ బిట్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కు ఇస్తుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో సరదాగా ఇలా మెరవడానికి చిరంజీవి సరదాపడతారనేది నిజమే అయినా, ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Chiranjeevi
Allu Arjun
Sukumar
Devisri Prasad

More Telugu News