వృద్ధాప్య పింఛన్లపై.. ఏపీ సీఎం జగన్కు రఘురామకృష్ణరాజు లేఖ!
- వృద్ధుల పింఛన్లను పెంచాలి
- ఈ నెల నుంచి రూ.2,750 ఇవ్వాలి
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
- హామీని నమ్మే ప్రజల నుంచి మద్దతు లభించింది
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారు. పింఛన్లను రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచుతామని అప్పట్లో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అందుకే ప్రజల నుంచి వైసీపీకి పూర్తి మద్దతు లభించిందని చెప్పారు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.