ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షల రద్దు
- ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తారంటూ ప్రచారం
- ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి సబిత
మరోవైపు, ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా స్పందించారు. పరీక్షల రద్దు విషయంలో ఇప్పటి వరకైతే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. దీనిపై త్వరలోనే సమీక్ష నిర్వహించిన అనంతరం స్పష్టమైన ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు.