మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్ కన్నుమూత
- అనారోగ్యంతో మరణించిన అనిరుధ్
- ఆయన వయసు 91 సంవత్సరాలు
- అనిరుధ్ తనయుడు ప్రవింద్ ప్రస్తుతం మారిషస్ ప్రధాని
- ప్రవింద్ ను ఫోన్ ద్వారా పరామర్శించిన ప్రధాని మోదీ
పితృవియోగంతో బాధపడుతున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ కు ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గొప్ప రాజనీతిజ్ఞుల్లో అనిరుధ్ జగన్నాథ్ ఒకరని మోదీ కొనియాడారు. అనిరుధ్ జగన్నాథ్ ను భారత ప్రభుత్వం గతేడాది పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఆయన రాజకీయ జీవితం 1963లో ప్రారంభమైంది.