Andhra Pradesh: ఏపీకి మరో 1.80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల చేరిక

More vaccine doses arrives AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి మరో 1.80 లక్షల వ్యాక్సిన్ డోసులు రావడం ప్రభుత్వ కార్యాచరణకు మరింత ఊతమివ్వనుంది. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న విమానంలో లక్ష కొవిషీల్డ్ డోసులు విజయవాడకు వచ్చాయి. అటు, హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 80 వేల కొవాగ్జిన్ డోసులు కూడా వచ్చాయి. కొత్తగా వచ్చిన ఈ లక్షకు పైగా డోసులతో వ్యాక్సిన్ పంపిణీలో పురోగతి కనిపించనుంది. కాగా, రాష్ట్రానికి చేరుకున్న వ్యాక్సిన్ డోసులను గన్నవరంలోని ప్రత్యేక స్టోరేజి యూనిట్ కు తరలించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Vaccine
Covishield
COVAXIN
Gannavaram

More Telugu News