దేశంలో కొత్తగా 166 గ్రీన్ జోన్లను గుర్తిస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటన
- దేశంలో డ్రోన్ల వినియోగానికి కేంద్రం చర్యలు
- ఏపీలో 4, తెలంగాణలో 9 గ్రీన్ జోన్ల గుర్తింపు
- 400 అడుగుల వరకు డ్రోన్లు ఎగురవేసే అవకాశం
- స్థానిక అధికారుల అనుమతితో డ్రోన్లు ఎగరేసే అవకాశం
కేంద్రం తాజా ప్రకటనతో కొత్త గ్రీన్ జోన్లలో డ్రోన్ల వినియోగానికి అవకాశమిచ్చినట్టయింది. స్థానిక అధికారుల నుంచి అనుమతి పొంది డ్రోన్లు ఎగురవేయొచ్చు. అనుమతులు ఉన్న ప్రదేశాల్లో 400 అడుగుల వరకు డ్రోన్లు ఎగురవేసే అవకాశం ఉంటుంది. నూతన గ్రీన్ జోన్ పాలసీతో దేశవ్యాప్తంగా డ్రోన్ల వాడకం ఊపందుకుంటుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.