అడివి శేష్ 'మేజర్' విడుదల వాయిదా!
- షూటింగు దశలో 'మేజర్'
- కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగు జరుపుకోలేకపోయింది. షూటింగు విషయంలో వచ్చిన గ్యాప్ ప్రభావం సహజంగానే విడుదల తేదీపై పడుతుంది. అందువలన ఈ సినిమాను ముందుగా చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. కరోనా పరమైన జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. సయీ మంజ్రేకర్ .. శోభితా ధూళిపాళ్ల .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.