గాంధీ ఆసుపత్రిలో మరో బ్లాక్ ఫంగస్ రోగి మృతి
- మహబూబ్ నగర్ జిల్లా వాసి ఫంగస్ తో మృతి
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మృతుడు
- కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫంగస్ బారిన పడిన వైనం
ఇన్ఫెక్షన్ కు గురైన ఆయనను కుటుంబసభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకినట్టు నిర్ధారించారు. అనంతరం ఆయనకు అక్కడ చికిత్స అందిస్తుండగా... ఆయన పరిస్థితి విషమించింది. దీంతో, ఆయనను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం మృతి చెందారు.