భారతదేశంలోని బియ్యం రకాలపై పూరీ జగన్నాథ్ 'మ్యూజింగ్స్'
- వివిధ అంశాలపై 'మ్యూజింగ్స్'
- రాజముడి బియ్యం వెరైటీపై పూరీ అభిప్రాయాలు
- ఇమ్యూనిటీ పెరుగుతుందని వెల్లడి
- మధుమేహం ఉన్నవారికి మంచిదని వివరణ
- దీని గంజి శ్రేష్టకరమని సూచన
వీటిలో రాజముడి బియ్యం అనే రకంపై పూరీ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఈ బియ్యం జన్మస్థలం కర్ణాటక అని, ఒకప్పుడు ఈ రాజముడి బియ్యం నగదుతో సమానంగా చలామణీ అయినట్టు వెల్లడించారు. రైతులు పన్నులు చెల్లించేందుకు డబ్బు లేకపోతే, ఈ రాజముడి బియ్యాన్ని చెల్లించేవారని వివరించారు. ప్రస్తుతం రాంబాబు, విజయరామ్ అనే సోదరులు ఈ బియ్యాన్ని పండిస్తున్నారని, వారే ఈ విషయాలను తనకు వివరించినట్టు తెలిపారు.
రాజముడి బియ్యం ప్రత్యేకతలు ఏంటంటే... ఇది మధుమేహం ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుందని, ఆడవాళ్లలో రుతుక్రమ సమస్యలు దూరం చేస్తుందని వెల్లడించారు. ఈ బియ్యాన్ని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టి, ఎసరు పోసి వండుకోవాలని పూరీ సూచించారు. వార్చిన గంజిని సాయంత్రం వేళల్లో తాగితే ఎంతో ఆరోగ్యకరమని, వ్యాధి నిరోధక శక్తి విశేషంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ బియ్యం వాడడం మొదలుపెట్టిన కొన్నిరోజుల్లోనే తేడా తెలుస్తుందని స్పష్టం చేశారు.