Andhra Pradesh: ఏపీలో కొత్తగా 20 వేలకు పైగా కరోనా కేసులు.. 82 మంది మృతి

  • ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  • ఇప్పటి వరకు 8,289 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,59,597
AP register 20034 new Corona cases in 24 hours

ఏపీలో కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులు ఆందోళనను పెంచుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 20,034 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 82 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మొత్తం 12,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028కి పెరగగా... 10,16,142 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 8,289 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,59,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News