భారత్ నుంచి ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా
- నిబంధనలు ఉల్లంఘించి దేశంలోకి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష
- నేటి నుంచే అమలు
- మండిపడిన ప్రతిపక్షాలు
- దేశప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామన్న ప్రధాని మారిసన్
ఈ నేపథ్యంలో స్పందించిన మారిసన్ నిషేధాన్ని సమర్థించుకున్నారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భారత్లో నెలకొన్న కొవిడ్ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని... దేశంలో మూడో దశ వ్యాప్తి ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. గతేడాది నుంచి దేశంలో బయో సెక్యూరిటీ చట్టం అమల్లో ఉందని, అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ జైలుకు పంపలేదన్నారు.