ప్రతి ఒక్కరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా: ఈటల
- ఈటలపై తీవ్ర ఆరోపణలు
- 100 ఎకరాలు కబ్జా చేశారంటున్న రైతులు
- విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్
- ఆరోగ్యమంత్రిగా ఈటలను తప్పించిన వైనం
- పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన ఈటల
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ, శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ ఈటల ట్వీట్ చేశారు.
మెదక్ జిల్లా మాసాయి పేట మండలం అచ్చంపేట గ్రామ పరిధిలో హేచరీస్ నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను రాయించుకున్నారంటూ ఈటలపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది.