ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కస్టడీ... అనుమతించిన కోర్టు!
- 4 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
- న్యాయవాది సమక్షంలో విచారించనున్న ఏసీబీ అధికారులు
- బెయిల్ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసిన కోర్టు
ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వం ఆధీనంలో ఉందని... ఈ నేపథ్యంలో ధూళిపాళ్లను విచారించాల్సిన అవసరం ఏముందని రామకృష్ణప్రసాద్ ప్రశ్నించారు. డెయిరీ ద్వారా ధూళిపాళ్ల వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి కొన్ని అంశాలను విచారించాల్సి ఉందని ఏసీబీ లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇంకోవైపు, ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.