కరోనా వేళ రూ. 7.5 కోట్ల విరాళం ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్
- కరోనా బారినపడిన వారికి తక్షణ సాయంగా ఉపయోగపడుతుందని ఆశాభావం
- రాజస్థాన్పై దృష్టి సారించామన్న ఫ్రాంచైజీ
- నిధుల సేకరణలో ఆటగాళ్ల పాత్ర ఉందన్న యాజమాన్యం
దేశవ్యాప్తంగా ఆపదలో చిక్కుకున్న వారికి ఈ విరాళం తక్షణ సాయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా తాము రాజస్థాన్పై దృష్టి సారించామని, రంజిత్ బర్తాకుర్ అధ్యక్షతన రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ (ఆర్ఆర్ఎఫ్) ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని ఆవేదన వ్యక్తం చేసింది.