డికాక్ అదుర్స్... రాజస్థాన్ రాయల్స్ పై అలవోకగా గెలిచిన ముంబయి ఇండియన్స్
- ఢిల్లీలో ముంబయి, రాజస్థాన్ మ్యాచ్
- 7 వికెట్ల తేడాతో నెగ్గిన ముంబయి ఇండియన్స్
- 172 రన్స్ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించిన వైనం
- 70 పరుగులతో అజేయంగా నిలిచిన క్వింటన్ డికాక్
అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరుకుంది.
ఇక, నేడు ఐపీఎల్ లో జరిగే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.