Adimulapu Suresh: ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదు: మంత్రి ఆదిమూలపు సురేశ్

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వర్చువల్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి జేసీలు, ఆర్ఐవోలు, డీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ, పరీక్షలపై విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని అన్నారు.  

షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు అనివార్యమని అందరూ గుర్తించాలని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఏపీలో సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తి చేసిన అధికారులను అభినందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
Adimulapu Suresh
Inter Exams
Virtual Review
Cancellation
Andhra Pradesh

More Telugu News