ప్రధాని మోదీ బంధువర్గంలో విషాదం... కరోనాతో పినతల్లి మృతి
- నర్మదాబెన్ కు కరోనా పాజిటివ్
- అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స
- క్షీణించిన ఆరోగ్యం
- నేడు ఆసుపత్రిలోనే కన్నుమూత
దీనిపై మోదీ తమ్ముడు ప్రహ్లాద్ స్పందిస్తూ... తమ పిన్నమ్మ పది రోజుల కిందట అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరిందని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిందని చెప్పారు. నర్మదాబెన్ భర్త జగ్జీవన్ దాస్ చాన్నాళ్ల క్రితమే మరణించారని ప్రహ్లాద్ మోదీ పేర్కొన్నారు.