రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత
- తెలంగాణలో కరోనా తీవ్రం
- నైట్ కర్ఫ్యూ ప్రకటించిన సర్కారు
- కీలక నిర్ణయం తీసుకున్న థియేటర్ ఓనర్ల సంఘం
- థియేటర్లు, మల్టీప్లెక్సుల స్వచ్ఛంద మూసివేతకు నిర్ణయం
తొలుత, రాత్రి 7.30 గంటల వరకే థియేటర్లు పనిచేస్తాయంటూ ప్రచారం జరిగింది. అయితే సినిమా ప్రదర్శనలను పూర్తిగా నిలిపివేయాలని ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్రం 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు అనుమతి నిచ్చింది. కొన్ని సినిమాలు కూడా విడుదలై చిత్ర పరిశ్రమ, అనుబంధ వ్యవస్థలు కోలుకుంటున్నాయన్న తరుణంలో కొవిడ్ మరోసారి పంజా విసిరింది.