Andhra Pradesh: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులోనే 5 వేలకు పైగా కేసుల నమోదు!

AP registers 5086 new cases in a single day
  • 24 గంటల్లో 5,086 మందికి సోకిన కరోనా
  • రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,710 
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 5,086 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 14 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపూర్, కర్నూల్, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 1,745 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 9,42,135కి చేరుకోగా.. 9,03,072 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం 7,353 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,55,70,201 శాంపిల్స్ ను పరీక్షించారు.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News