తూర్పుగోదావరి జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
- ఈ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఘటన
- కంటెయినర్ను ఢీకొట్టిన లారీ
- లారీని తప్పించే ప్రమాదంలో డివైడర్ను ఢీకొట్టిన బస్సు
మరోవైపు, కంటెయినర్ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవర్ను అతి కష్టం మీద వెలికి తీశారు. గాయపడిన ప్రయాణకులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.