Corona Virus: అడ్డంకులను ఎదురొడ్డి 80కి పైగా దేశాలకు టీకాలు పంపాం: మోదీ

Vaccines have been sent to more than 80 countries
  • కరోనా అంతంలో భారత్‌ ముందుంటుందని హామీ
  • 130 కోట్ల మందిని కాపాడుకుంటూనే ఇతర దేశాలకు సాయం
  • కరోనా అంతానికి మానవాళి ఏకతాటిపైకి రావాలి
  • 'రైసీనా డైలాగ్‌ 2021'లో ప్రధాని మోదీ
భారత్‌ ఇప్పటి వరకు 80కి పైగా దేశాలకు కరోనాను నిరోధించే టీకాలను సరఫరా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ.. ఈ కార్యాన్ని విజయవంతంగా కొనసాగించామని పేర్కొన్నారు. అలాగే కరోనా నుంచి మానవాళిని కాపాడేందుకు జరుగుతున్న కృషిలో భారత్‌ తన శక్తి, సామర్థ్యాల మేరకు ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. రైసీనా డైలాగ్‌ 2021 ప్రారంభోపన్యాసంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో 130 కోట్ల మందిని రక్షించుకునేందుకు చర్యలు చేపడుతూనే ఇతర దేశాలకు సాయం అందించామని మోదీ తెలిపారు. మహమ్మారిని రూపుమాపాలంటే మానవాళి మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని భారత్‌ ముందే గుర్తించిందని తెలిపారు. దాదాపు శతాబ్ద కాలం తర్వాత ఈ ప్రపంచం ఓ మహమ్మారిని ఎదుర్కొంటోందని ప్రధాని గుర్తు చేశారు. అయితే, తాజాగా వచ్చిన కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు మాత్రం ఈ సమాజం సంసిద్ధంగా లేదని తెలిపారు. గత ఏడాది కాలంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ వర్గాల కృషి వల్ల కొన్నింటికి పరిష్కారం లభించిందన్నారు. ఇంకా అనేకం అలాగే ఉండిపోయాయన్నారు.
Corona Virus
COVID19
Raisina Dialogue
modi
corona vaccine

More Telugu News